ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైరు పంక్చరై ట్రాక్టర్‌ బోల్తా..

ABN, First Publish Date - 2022-12-06T23:23:01+05:30

ట్రాక్టర్‌ టైరు పం క్చర్‌ అయి అదుపు త ప్పి ట్రాలీ బోల్తా కొట్టడంతో దాని కింద ప డి రైతు మృతి చెం దాడు. ఈ సంఘటన తాటూకుపాలెం-పెట్లూరు గ్రామాల మ ధ్య మంగళవారం చో టుచేసుకుంది.

మృతుడు మాలకొండయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాలీ కిందపడి రైతు మృతి.. చవటపాలెంలో విషాదం

కొండపి, డిసెంబరు 6 : ట్రాక్టర్‌ టైరు పం క్చర్‌ అయి అదుపు త ప్పి ట్రాలీ బోల్తా కొట్టడంతో దాని కింద ప డి రైతు మృతి చెం దాడు. ఈ సంఘటన తాటూకుపాలెం-పెట్లూరు గ్రామాల మ ధ్య మంగళవారం చో టుచేసుకుంది. అందిన సమాచారం మేర కు.. మండలంలోని పెట్లూరు గ్రామ పం చాయతీ పరిధి చవటపాలేనికి చెందిన రైతు వేముల మాలకొండయ్య (50) తన ట్రాక్టర్‌ ట్రాలీ మరమ్మతులకు గురవడంతో కొండపి తీసుకువచ్చాడు. మరమ్మతులు చేయించుకొని ఇంటికి బయల్దేరాడు. తాటాకులపాలెం-పెట్లూరు గ్రామాల మధ్యకు చేరుకోగానే ట్రాక్టర్‌ ముందు టైరుకు పంక్చర్‌ పడింది. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న చప్టా గోడదాటి గుంతలోకి వెళ్లింది. ఈ సమయంలో తప్పించుకునేందుకు మాలకొండయ్య ట్రాక్టర్‌ నుంచి కిందకు దూకాడు. ఆయనపై ట్రాలీ తిరగబడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో చవటపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి. మాలకొండయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె లండన్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కుమారుడు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడని గ్రామస్థులు తెలిపారు. కొండపి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-06T23:23:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising