ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్తను హత్య చేసిన అల్లుడు

ABN, First Publish Date - 2022-07-02T04:59:21+05:30

మండలంలోని బొట్లపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళదారుణ హత్యకు గురైంది. సొంత అల్లుడే ఆమెను కత్తితో పొడిచి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం బొట్లపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ లక్ష్మీ(45)కి సుకన్య అనే కుమార్తె ఉంది. లక్ష్మీ భర్త కొంతకాలం క్రితమే ఆమెను వదిలి వెళ్లాడు. తల్లీ కూతుళ్లు బొట్లపాలెంలో నివాసం ఉంటున్నారు. కుమార్తె సుకన్యకు చీమకుర్తి గ్రామానికి చెందిన పాలపర్తి యల్లయ్యతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె పుట్టింది.

హత్యకు గురైన దేవరకొండ లక్ష్మీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొట్లపాలెంలో దారుణ ఘటన

దర్శి, జూలై 1 : మండలంలోని బొట్లపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళదారుణ హత్యకు గురైంది. సొంత అల్లుడే ఆమెను కత్తితో పొడిచి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం బొట్లపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ లక్ష్మీ(45)కి సుకన్య అనే కుమార్తె ఉంది. లక్ష్మీ భర్త కొంతకాలం క్రితమే ఆమెను వదిలి వెళ్లాడు. తల్లీ కూతుళ్లు బొట్లపాలెంలో నివాసం ఉంటున్నారు. కుమార్తె సుకన్యకు చీమకుర్తి గ్రామానికి చెందిన పాలపర్తి యల్లయ్యతో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమార్తె పుట్టింది. అనంతరం సుకన్య, యల్లయ్యల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. సుకన్య భర్తను వదిలి తల్లి లక్ష్మీతో కలిసి అద్దంకిలో నివాసం ఉంటోంది. 20 రోజుల క్రితం యల్లయ్య పెద్ద మనుషులను తీసుకొని అద్దంకి వెళ్లి భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. బొట్లపాలెంలో వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు. అయితే భార్యకు ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న యల్లయ్య తన భార్యను అత్త లక్ష్మీ చెడగొట్టిందని అక్కసు పెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం భార్య సుకన్య మళ్లీ అద్దంకి వెళ్లింది. ఈ నేపథ్యంలో అత్త లక్ష్మీ ఒంటరి మహిళ పించన్‌ తీసుకునేందుకు శుక్రవారం బొట్లపాలెం వచ్చింది. పించన్‌తీసుకొని ఇంటికి వచ్చిన లక్ష్మీని అల్లుడు యల్లయ్య కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. భార్యను చెడగొట్టిందనే కోపంతోనే హత్య చేసినట్లు సమాచారం. దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ఏ చంద్రశేఖర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-07-02T04:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising