ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను గొడ్డలితో నరికిన భర్త

ABN, First Publish Date - 2022-08-19T05:08:51+05:30

నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లికి చెందిన రమాదేవి(37)ని ఆమె భర్త కాశీరావు గొడ్డలితో నరికి హత్య చేశాడు.

రమాదేవి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, ఆగస్టు 18 : నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లికి చెందిన రమాదేవి(37)ని ఆమె భర్త కాశీరావు గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసుల వివరాల మేరకు.. గాజులపల్లికి చెంది న కాశీరావుకు గిద్దలూరుకు చెందిన రమాదేవితో 24 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఓ కూతురు ఉండగా ఆమెకు వివాహం చేశారు. గురువారం తెల్లవారుజామున రమాదేవి నిద్రిస్తుండగా ఆమె భర్త కాశీరావు కిరాతకంగా గొడ్డలితో తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. వివాహేతర సంబంధమే హత్య కు దారి తీసినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహానంది పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-08-19T05:08:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising