ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి

ABN, First Publish Date - 2022-08-10T04:10:59+05:30

వైసీపీ పాలనకు చరమగీ తం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి సలగల రాజశేఖర్‌బాబు అన్నారు.

ఉప్పుటూరులో జరిగిన బాదుడే బాదుడులో కార్యక్రమంలో పాల్గొన్న రాజశేఖర్‌బాబు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పుటూరు(పర్చూరు), ఆగస్టు 9: వైసీపీ పాలనకు చరమగీ తం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి సలగల రాజశేఖర్‌బాబు అన్నారు. మంగళవారం మండలం లోని ఉప్పుటూరులో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నిత్యావసర వస్తు వులైన పెట్రోలు, డీజిల్‌, ఇసుక, ఆర్జీసీ, కరెంటు చార్జీలు విపరీ తంగా పెంచి పేదప్రజలపై పెనుబారం మోపారని ధ్వజమెత్తా రు. వైసీపీ విధ్వంస, ఆరాచక పాలన పరాకాష్టకు చేరిందన్నారు. ప్రజలు  తగిన బుద్ధిచెప్పే రోజు దగ్గరపడిందన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్‌రెడ్డి పేదలకు వలవిసిరి నడ్డి విరగొట్టారన్నారు. మళ్ళీ రాష్ట్రం గాడిన పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు.  ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పెంచిన చార్జీ లు, ధరలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ షం షుద్దీన్‌, కార్యదర్శి కొరిటాల సురేష్‌, గ్రామ అధ్యక్షుడు మువ్వా ఆంజేయులు, కామేపల్లి హరిబాబు, షేక్‌ హుస్సేన్‌, మామిడిపాక హరిప్రసాద్‌, పాలపర్తి శ్రీను, నరేంద్ర, పాలేరు గోపి, సుబ్బయ్య , హుస్సేన్‌ నాగరాజు, తమ్ములూరి శివ, రామకృష్ణ, జానీ పాల్గొన్నా రు. అంతకుముందు గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. 


Updated Date - 2022-08-10T04:10:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising