అందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలి
ABN, First Publish Date - 2022-08-09T04:27:46+05:30
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని డీఈవో విజయభాస్కర్ ఆదేశించారు. ఆయన సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డీఈవో విజయభాస్కర్
దర్శి, ఆగస్టు 8 : విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని డీఈవో విజయభాస్కర్ ఆదేశించారు. ఆయన సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందాయా లేదా అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఇప్పటి వరకు 76 శాతం మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అంది చినట్లు చెప్పగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూరుశాతం పుస్తకాలు పంపిణీ చేసినప్పనటికీ ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే పుస్త కాలు పంపిణీ చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈ వో కె.రఘురామయ్య, సమగ్ర శిక్షణ అభియాన్ సీఎంవో కొండారెడ్డి, ఓపెన్స్కూల్స్ జిల్లా సయన్వయకర్త శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-08-09T04:27:46+05:30 IST