వైసీపీ పాలనలో ప్రజలపై పన్నుల బాదుడు
ABN, First Publish Date - 2022-05-18T06:39:58+05:30
వైసీపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను అమాం తం పెంచి ప్రజలపై పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తోందని టీడీపీ మం డల అధ్యక్షుడు మోరబోయిన బాబు రావు అన్నారు.
కొనకనమిట్ల, మే 18 : వైసీపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను అమాం తం పెంచి ప్రజలపై పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తోందని టీడీపీ మం డల అధ్యక్షుడు మోరబోయిన బాబు రావు అన్నారు. మండలంలోని కాట్ర గుంట గ్రామంలో సోమవారం టీడీపీ నాయకులు ‘బాదుడే బాదుడు’ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి జగన్మోహనరెడ్డి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారం చేపట్టిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మరిచారన్నారు. దీనికి తోడు నిత్యవసర వస్తువుల ధరలు, కరెంట్బిల్లులు, బస్సు చార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటి ధరలు విపరితంగా పెంచి ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక అందని ద్రాక్షాలా మారిందని దీంతో నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ఇప్పటికైనా ప్రజలు వైసీపీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని హితవు పలికారు. రానున్నది టీడీపి ప్రభుత్వమేనని అందుకు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల మాజీఅధ్యక్షులు వరికూటి వెంకటరామిరెడ్డి, నరసింహారావు, పొదిలి మార్కెట్యార్డు మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, పెరికె సుఖ్దేవ్, టీడీపీ నాయకులు కుందూరి కాశిరెడ్డి, పరిటాల సుబ్బయ్య, పొదిలి తిరపతయ్య, మలినేని రామారావు, శ్రీకాంత్రెడ్డి, మల్లికార్జున్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-18T06:39:58+05:30 IST