ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత కబ్జాను అడ్డుకున్న ఎస్సీలు

ABN, First Publish Date - 2022-08-17T04:44:05+05:30

ఎస్సీలకు చెందిన 30 ఎకరాల పొలాన్ని అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నాయకుడు కబ్జా చేయాలని చూస్తున్న యత్నాలను ఎస్సీలు అడ్డుకున్నారు.

భూ కబ్జాను అడ్డుకున్న టీడీపీనేత దాసరి మల్లికార్జున, ఎస్సీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

30 ఎకరాల పొలాన్ని ఆక్రమించేందుకు అధికారం అండతో యత్నం


సీఎ్‌సపురం, ఆగస్టు 16 : ఎస్సీలకు చెందిన 30 ఎకరాల పొలాన్ని అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నాయకుడు కబ్జా చేయాలని చూస్తున్న యత్నాలను ఎస్సీలు అడ్డుకున్నారు. మండలంలోని డీజీపేట పంచాయతీ బోడావులదిన్నె గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలకు చెందిన 30ఎకరాల పొలాన్ని గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఆక్రమించేందుకు యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సీలు టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లికార్జున సహకారంతో మంగళవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీలు ఆ పొలానికి కంచె వేసుకుని విలువైన చెట్లు వేసి ఉన్నారన్నారు. బోడావులదిన్నె గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు అన్నెబోయిన తిరుపతయ్య ఆ పొలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో సర్వే రాళ్లు, చెట్లు, కంచెను ధ్వంసం చేశారని తెలిపారు. అక్రమంగా పొలాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు స్పందించి  వైసీపీ నాయకునిపై చర్యలు తీసుకుని ఎస్సీల పొలాన్ని కాపాడాలని ఆయన కోరారు.


Updated Date - 2022-08-17T04:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising