ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల స్థలాన్ని కాపాడండి!

ABN, First Publish Date - 2022-06-28T05:45:26+05:30

పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని, ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, స్థలాన్ని కాపాడటం కోసం ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమంటూ ఓ విద్యా కమిటీ చైర్మన్‌ హల్‌చల్‌ చేశారు.

సెల్‌ టవర్‌ ఎక్కిన విద్యా కమిటీ చైర్మన్‌ పుల్లయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెల్‌టవర్‌ ఎక్కి విద్యా కమిటీ చైర్మన్‌ ఆత్మహత్యాయత్నం

అధికారుల హామీతో దిగివచ్చిన పుల్లయ్య

మార్కాపురం, జూన్‌ 27: పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని, ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, స్థలాన్ని కాపాడటం కోసం ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమంటూ ఓ విద్యా కమిటీ చైర్మన్‌ హల్‌చల్‌ చేశారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం సెల్‌టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. అర్ధవీడు మండలం శంకరాపురంలోని సర్వే నెంబర్‌ 546లో 3.80 ఎకరాల భూమిని ఎంపీపీ పాఠశాలకు కేటాయించారని, ఆ భూమిని గ్రామానికి చెందిన బుసా వెంకట నారాయణ ఆక్రమించి గోడకట్టుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ భీమానాయక్‌ అక్కడకు చేరుకొని నచ్చజెప్పి పుల్లయ్యను కిందకు దించారు. అనంతరం ఆయనతో ఆర్డీవో మాట్లాడారు. 


Updated Date - 2022-06-28T05:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising