ఉత్తమ సేవలందించిన అధికారులకు గుర్తింపు
ABN, First Publish Date - 2022-01-27T05:47:54+05:30
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేసింది.
దర్శి, జనవరి 26 : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేసింది. దర్శి వ్యవసాయశాఖ ఏడీఏ అర్జున్ నాయక్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ చేతుల మీదగా అవార్డును అందుకున్నారు. ఈ క్రాప్ నమోదు చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఉత్తమ ఏఎసై్ౖసగా శ్రీనివాసరావు
పీసీపల్లి : పోలీసుస్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఉత్తమ ఏఎస్సైగా ఎంపికయ్యారు. గొలుసు చోరీ కేసును వేగంగా ఛేదించి ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు.
వ్యవసాయాధికారి సేవలకు ప్రశంస
తాళ్లూరు : మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఏవో అవార్డును జిల్లా కలెక్టర్ చేతులు మీదుగా అందుకున్నారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడంతో ఆయనసేవలను ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించింది.
పూరిమెట్ల ట్రాన్స్కో లైన్మెన్కు అవార్డు
ముండ్లమూరు : మండలంలోని పూరిమెట్ల గ్రామంలో ట్రాన్స్కో లైన్మెన్గా పని చేస్తున్న పీవీ రామాంజనేయులుకు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ లైన్మెన్గా ఎంపిక చేస్తూ బుధవారం జిల్లా కేంద్రం ఒంగోలులో ట్రాన్స్కో ఎస్ఈ కేవీవీ సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డుతో పాటు జ్ఞాపిక అందుకున్నారు.
వైద్యురాలికి ప్రశంసాపత్రం
కనిగిరి, జనవరి 26: కొవిడ్ సమయంలో వైద్యురాలిగా ఉత్తమ సేవలు అందించిన వైద్యాధికారి డాక్టర్ నాగరాజ్యలక్ష్మీకి జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా కనిగిరి విద్యుత్శాఖలో గ్రామీణ విద్యుత్లైన్ ఇన్స్పెక్టర్గా ఉత్తమ సేవలు అందించినందుకు వెంకటయ్యకు విద్యుత్శాఖ ఎస్సీ సత్యనారాయణ ఉత్తమ ప్రశంసా సేవాపత్రాన్ని అందజేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో వీరికి ఈ అవార్డులుదక్కాయి.
Updated Date - 2022-01-27T05:47:54+05:30 IST