Ongole జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం..
ABN, First Publish Date - 2022-06-05T17:18:54+05:30
ఒంగోలు (Ongole) జేయంబీ చర్చి (JMB Church)లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది.
Prakasam: ఒంగోలు (Ongole) జేయంబీ చర్చి (JMB Church)లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలతో ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనవాసరెడ్డి, సుధాకర్ బాబు సమావేశమయ్యారు. అయితే ఎమ్మెల్యేల సమక్షంలోనే పాస్టర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో త్వరలోనే చర్చి వివాదానికి పరిష్కార మార్గం చూపుతామని ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.
Updated Date - 2022-06-05T17:18:54+05:30 IST