మర్కాపురంలో వివాదాస్పందగా మున్సిపల్ అధికారుల తీరు
ABN, First Publish Date - 2022-05-21T16:44:00+05:30
జిల్లాలోని మార్కాపురంలో మున్సిపల్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది.
ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో మున్సిపల్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశమైంది. శిలా ఫలకంలో ప్రొటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును అధికారులు వేయాల్సి ఉంది. అయితే... ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు. శిలాఫలకం చర్చనీయాంశంగా మారడంతో పేరు చివర ఉన్న రెడ్డికి నలుపు రంగు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
Updated Date - 2022-05-21T16:44:00+05:30 IST