Prakasam: తోటవారిపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ
ABN, First Publish Date - 2022-01-05T14:57:34+05:30
ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో చోరీ జరిగింది.
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో చోరీ జరిగింది. రెండు హుండీలను పగలగొట్టిన దుండగులు నగదును అపహరించారు. దేవస్దానంలోని సీసీ కెమెరాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2022-01-05T14:57:34+05:30 IST