సమస్యలపై సీఎంకు పోస్టుకార్డులు
ABN, First Publish Date - 2022-08-10T03:47:05+05:30
సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం పోస్టుకార్డులను సీఎంకు పంపించారు.
దర్శి, ఆగస్టు 9 : సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం పోస్టుకార్డులను సీఎంకు పంపించారు. 100 రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా వారు ఏపీటీఎఫ్ కార్యాలయం వద్ద పోస్టుకార్డులు పంపుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రధర్, ఎన్జాన్, నాయకులు కృష్ణ, నరసింహం, శ్రీని వాసరావు, వెంగయ్య, కొండారెడ్డి, రఘురామిరెడ్డి, మస్తాన్వలి పాల్గొన్నారు.
11న కలెక్టరేట్ ముట్టడికి తరలిరండి
ముండ్లమూరు : సీపీఎస్ రద్దుతోపాటు సమస్యలను పరిష్కరించాలని ఈనెల 11న తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడు ఎస్కే మస్తాన్వలి కోరారు. మంగళవారం ఏపీ మోడల్ స్కూల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు చె ల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ మండలాధ్యక్షుడు తిప్పిశెట్టి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఏలీషా, జిల్లా కౌన్సిలర్లు లెవి ప్రసాద్, షేక్ మస్తాన్వలి, రాఘవ, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-10T03:47:05+05:30 IST