ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల కుంటలో విషప్రయోగం ?

ABN, First Publish Date - 2022-08-18T04:56:47+05:30

పర్చూరు మండల పరిఽధిలోని నాగులపాలెం శివారు కుంటలో పెంచుతున్న చేపలు చనిపోవటంపై బాధితుడు లబోదిబో మంటున్నాడు. పర్చూరు చెంచుల కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు నాగులపాలెం గ్రామానికి చెందిన ఓవ్యక్తి కుంటను లీజుకు తీసుకుని చేపలను పెంచుతున్నాడు. బుధవారం ఉదయం కుంటవద్దకు వెళ్లగా చేపలు చనిపోయి పైకి తేలటంతో ఆందోళనకు గురయ్యాడు.

చనిపోయి నీటిపై తేలియాడుతున్న చేపలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబోదిబో మంటున్న బాధితుడు

పోలీసులకు ఫిర్యాదు

నాగులపాలెం(పర్చూరు), ఆగస్టు 17: పర్చూరు మండల పరిఽధిలోని నాగులపాలెం శివారు కుంటలో పెంచుతున్న చేపలు చనిపోవటంపై బాధితుడు లబోదిబో మంటున్నాడు. పర్చూరు చెంచుల కాలనీకి చెందిన నల్లబోతుల శ్రీనివాసరావు నాగులపాలెం గ్రామానికి చెందిన ఓవ్యక్తి కుంటను లీజుకు తీసుకుని చేపలను పెంచుతున్నాడు. బుధవారం ఉదయం కుంటవద్దకు వెళ్లగా చేపలు చనిపోయి పైకి తేలటంతో ఆందోళనకు గురయ్యాడు. లక్షల రూపాయలు వెచ్చించి పెంచుకున్న చేపలు మృతి చెందటంతో బోరున విలపించాడు. గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లే చేపలు చనిపోయాయని ఆరోపిస్తున్నాడు. అయితే రైతులు పొలం పనులకు సంబంధించిన క్రిమిసంహారాలు కుంటలో కలపటం వల్ల మృతి చెందాయా, లేక ఎవరైనా విషప్రయోగం చేశారా అన్న విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. దీనిపై బాధితుడు శ్రీనివాసరావు పర్చూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2022-08-18T04:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising