ఎందుకు ఓటేశామని ప్రజలు మదనపడుతున్నారు..!
ABN, First Publish Date - 2022-08-06T06:06:55+05:30
వైసీపీకి గత ఎన్నికలలో ఓట్లేందుకు వేశామని ప్రజలు మదనపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
మార్కాపురం, ఆగస్టు 5: వైసీపీకి గత ఎన్నికలలో ఓట్లేందుకు వేశామని ప్రజలు మదనపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ పట్టణ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఆంధ్ర ప్రదేశ్ గౌరవానికి భంగం కలిగించిన ఎంపీ గోరంట్ల మాధవ్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందన్నారు.. అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత మరో మాట చెబుతున్నారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ఏడాది క్రితం ఒక మంత్రి ఆరు నెలల తర్వాత మరో మంత్రి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశార న్నారు. ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ ఏకంగా నగ్నంగా వీడియో కాల్తో మహిళతో అసభ్య కరంగా వ్యవహరించారన్నారు. ఎంపీ స్థాయిలో ఉండి ఇటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం దారుణమన్నారు. వైసీపీ అధిష్టానం తన నిజాయితీని నిరూ పించుకోవడానికి ఎంపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కార్య క్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మౌలాలీ, కొప్పుల శ్రీనివాసులు, తెలుగు యువత జిల్లా నాయకులు దొడ్డా రవి కుమార్(డి.డి), టీడీపీ నాయకులు పఠాన్ ఇబ్రహిం, గఫార్ తది తరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-06T06:06:55+05:30 IST