నేడు వెంగమాంబలో ఎన్టీఆర్ వర్ధంతి
ABN, First Publish Date - 2022-01-18T05:37:35+05:30
పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్ హాల్లో కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, పార్టీ యువనేత ఇంటూరి రాజేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఉదయం 10 గంటలకు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం, అక్కడ నుంచి ర్యాలీగా వెంగమాంబ ఫంక్షన్ హాలుకు చేరుకుంటారని తెలిపారు.
కందుకూరు, జనవరి 17 : పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్ హాల్లో కందుకూరు నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, పార్టీ యువనేత ఇంటూరి రాజేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఉదయం 10 గంటలకు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం, అక్కడ నుంచి ర్యాలీగా వెంగమాంబ ఫంక్షన్ హాలుకు చేరుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంస్మరణ సభ జరుగుతుందని, సర్వమత ప్రార్థనల అనంతరం అన్నదానం, రక్తదాన శిబిరాలను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రక్తదాన శిబిరంలో యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నియోజక వర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు ఇంటూరి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, ఎన్వీ సుబ్బారావు, నార్నె రోశయ్య, జీ మోహే, షేక్ రఫీ, సలాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-18T05:37:35+05:30 IST