ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాటాలు ఉధృతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-20T05:50:00+05:30

పుచ్చపల్లి సుందరయ్య స్ఫూర్తితో శ్రామిక, రైతు పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్‌ కే హేమలత పిలుపునిచ్చారు.

పుచ్చలపల్లి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు హేమలత

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 19 : పుచ్చపల్లి సుందరయ్య స్ఫూర్తితో శ్రామిక, రైతు పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డాక్టర్‌ కే హేమలత పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్‌లో గురువారం పుచ్చలపల్లి సుందరయ్య  వర్ధంతి సభ జరిగింది.  ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జీవీ కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హేమలత మాట్లాడుతూ వివిధ తరగతుల ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు, పన్నుల మోతతో ప్రజలకు పెనుభారంగా మారిందన్నారు. విచ్చలవిడిగా ప్రైవేటీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం తూర్పు ప్రకాశం కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, కే ఉమామహేశ్వరరావు, కే సుబ్బరావమ్మ, వై.సిద్దయ్య, జాలా అంజయ్య, కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, షేక్‌ మాబు, రఘరాం, రమాదేవి, పీ కల్పన, షేక్‌ అమీర్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-20T05:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising