ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పైపులైన్లకు కొత్త కనెక్షన్లు

ABN, First Publish Date - 2022-05-17T06:50:54+05:30

మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని లక్ష్మక్కపల్లె ఎస్సీ కాలనీలో ప్రజలదాహార్తిని తీర్చేందుకు జలజీవన్‌ పథకం నిధులు మంజూరయ్యాయి.

లీకేజీ పైపులను చూపిస్తున్న కాలనీ వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తర్లుపాడు, మే 16: మండలంలోని కలుజువ్వలపాడు పంచాయతీలోని లక్ష్మక్కపల్లె ఎస్సీ కాలనీలో ప్రజలదాహార్తిని తీర్చేందుకు జలజీవన్‌ పథకం నిధులు మంజూరయ్యాయి. అయితే సదరు కాంట్రాక్టర్‌ గ్రామంలో ఉన్న పాతలైనుకే ట్యాప్‌లు బిగించి మసిబూసి మారెడుకాయ చేస్తున్నారని ప్రజలు ఆందోళన  వ్యక్తం చేశారు. 

జలజీవన్‌ మిషన్‌ పథకం కింద కాలనీలో మంచినీటి సరఫరా చేసేందుకు రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో కొత్తగా బోరు వేసి మోటరు బిగించి కాలనీ మొత్తం పైపులైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కొళాయి బిగించాల్సి ఉంది. అయితే సదరు కాంట్రాక్టర్‌ గతంలో ఉన్నలైనుకే ట్యాపులు బిగించి నామమాత్రంగా పనులు చేస్తున్నారు. పనుల పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవు. పాతపైపులైనుకే ట్యాప్‌లు బిగించడంతో లైన్లు లీకేజీ అవుతు న్నాయి. మురుగునీరు పైపుల్లోకి కొళాయిలోకి వస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.  సదరు కాంట్రాక్టర్‌ జలజవన్‌ మిషన్‌ పథకం పనులు నాసిరకంగా చేస్తున్నారని పల్లెనిద్రకు వచ్చిన అధికారులకు తెలిపినట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. గతంలో ఉన్న ట్యాంక్‌ కూడా పాచిపట్టి లోపల చెత్తాచెదారం నిండింది. దీంతో ట్యాంక్‌ వద్ద నీరు తెచ్చుకో లేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీలో నాణ్యమైన పైపులు వేసి సురక్షితమైన మంచినీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-17T06:50:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising