నర్సరీలకు లైసెన్స్లు తప్పనిసరి
ABN, First Publish Date - 2022-01-25T04:40:22+05:30
నర్సరీ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని ఉద్యాన అధికారి శ్వేత సోమవారం తెలిపారు.
కంభం, జనవరి 24 : నర్సరీ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని ఉద్యాన అధికారి శ్వేత సోమవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఉద్యాన నర్సరీల చట్టం 2010 నిబంధనలకు లోబడి ఈ లైసెన్సులు జారీ చేస్తామన్నారు. లైసెన్సులు లేని నర్సరీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లైసెన్సులు లేని నర్సరీలపై చర్యలు
బేస్తవారపేట : ఉద్యాన శాఖ లైసెన్స్లు లేని నర్సరీలపై చర్యలు తీసుకుంటామని ఆశాఖ అధికారి శ్వేత అన్నారు. సోమవారం బేస్తవారపేట మండలంలోని నర్సరీలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీల నిర్వాహకులు కచ్చితంగా ఉద్యాన శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. పలు నర్సరీలకు చెం దిన రికార్డులను ఆమె పరిశీలించారు. మండలంలో 28 నర్సరీలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ లైసెన్సులు పొందాలని, లీజు పత్రాలు, నర్సరీలో ఉన్న స్టాక్ వివరాలు, ఆధార్కార్డు, యజమాని ఫొటోతో రూ.1000 చ లానా చెల్లించాలన్నారు. మట్టి నమూనా రిపోర్టుతో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెలాఖరులోగా లైసెన్స్లు పొందాల న్నారు. అనుమతులు లేనివారిపై కఠిన చర్యలు తప్పవని శ్వేత హెచ్చరించారు.
Updated Date - 2022-01-25T04:40:22+05:30 IST