వైసీపీని గద్దెదించుందాం : నారాయణరెడ్డి
ABN, First Publish Date - 2022-08-14T07:48:27+05:30
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మార్కాపురం టీడీపీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు.
పొదిలిరూరల్, ఆగస్టు 13 : వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మార్కాపురం టీడీపీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలోని విశ్వనాథపురంలోని నిర్మలాకాన్వెంట్, జూనియర్ కాలేజి సెంటర్, విరాట్నగర్ తదితర ప్రాంతాలలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి నవరత్నాల పథకాలు అమలుజేసి 30 సంవత్సరాలు ధరలు పెరగకుండా చేస్తామని హామీలు గుప్పించారన్నారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చిన ప్రజలను తీవ్రంగా దోచుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కుద్ధూస్, మండల అధ్యక్షులు ఓబులరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-14T07:48:27+05:30 IST