నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లు వేయాలి
ABN, First Publish Date - 2022-01-19T05:25:27+05:30
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే వెంచర్లు వేయాలని ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్
కనిగిరి, జనవరి 18: ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే వెంచర్లు వేయాలని ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ అ నుమతి లేని లేఅవుట్లు చెల్లవని చెప్పారు. మం గళవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అ నుమతులు లేని లేఅవుట్లు వేసిన రియల్టర్లకు తమ మద్దతు ఇవ్వబోమని పేర్కొన్నారు. నిభందనలు, ప్రభుత్వ అనుమతుల ప్రకారం లేఅవుట్లు వేసిన వారికి మాత్రమే తాము పూర్తిగా అండగా ఉంటామని చెప్పారు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు ఎవ్వ రూ కొని నష్టపోవద్దని హిత వు పలికారు.
సమావేశంలో తహసీల్దార్ పుల్లారావు, నగర పంచా యతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, జడ్పీటీసీ మడతల క స్తూరిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సూరసాని మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-19T05:25:27+05:30 IST