1 నుంచి చీమకుర్తిలో భూరీసర్వే
ABN, First Publish Date - 2022-08-18T05:36:01+05:30
చీమకుర్తి నగరపంచాయతీ పరిధిలో భూహక్కు- భూరీ స ర్వే కార్యక్రమాన్ని సెప్టెం బరు ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కమిషనర్ షేక్ ఫజూలుల్లా తెలిపారు.
చీమకుర్తి, ఆగస్టు 17 : చీమకుర్తి నగరపంచాయతీ పరిధిలో భూహక్కు- భూరీ స ర్వే కార్యక్రమాన్ని సెప్టెం బరు ఒకటో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కమిషనర్ షేక్ ఫజూలుల్లా తెలిపారు. పట్టణంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ సరేర్వ జ రుగుతుందన్నారు. బుధవారం స్థానిక నగరపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరి గిన సమావేశంలో పాలకవర్గం, ప్రజాప్ర తినిధులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వార్డు సెక్రటరీలు, సర్వేయర్లు, వలంటీర్లకు స ర్వేపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు పట్టణంలో గృహలకు ఎసెస్మెంట్ నంబర్లు మాత్రమే ఉన్నాయని, సర్వే పూర్తయితే గృహలకు, స్థలాలకు సరిహద్దు లతో పాటు విస్తీర్ణం, సర్వేనంబర్ని సైతం కేటాయిస్తా మన్నారు. వీటి వివరాలను ధృవీకరిస్తూ భూహక్కు పత్రాన్ని యజమానికి అందచే స్తారని కమిషనర్ తెలిపారు. ఈ రీసర్వేతో స్థల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. మోప్మా పీడీ రవికుమార్ ప్రభుత్వ పథకాలపై సమీక్ష జరిపారు. ప్రజలకు సత్వరమే సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులను కోరారు. కార్యక్ర మంలో చైర్మన్ చల్లా అంకులు, వైస్ చైర్మన్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-18T05:36:01+05:30 IST