కృష్ణారావుకు అంతర్జాతీయ పురస్కారం
ABN, First Publish Date - 2022-08-19T04:40:02+05:30
మార్కాపురం మండలం నికరంపల్లికి చెందిన కృ ష్ణారెడ్డికి అంతర్జాతీయ పురస్కారం దక్కింది.
మార్కాపురం, ఆగస్టు 18 : మార్కాపురం మండలం నికరంపల్లికి చెందిన కృ ష్ణారెడ్డికి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఫొటో గ్రాఫర్గా తాను తీసిన చిత్రా లకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంస లందాయి. కృష్ణారెడ్డి హైదరాబాద్, రాజ మండ్రి, తూర్పుగోదావరి తదితర ప్రాంతాలకు వెళ్లి ఛాయాచిత్రాలను తీశారు. జూ లైలో ఇమేజి కొలీగ్ సొసైటీ, ఇంటర్నేషనల్ యూఎస్ఏ సంస్థకు ఆన్లైన్లో తాను తీసిన 12 ఫొటోలను పంపించారు. ఫొటోలను పరిశీలించిన అసోసియేటెడ్ ఇమేజి కొలీగ్ సొసైటీ కృష్ణారెడ్డికి పురస్కారాన్ని ప్రకటించింది. వరల్డ్ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గురువారం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ ప్రసాదరాజు, ఎం పీ మోపిదేవి వెం కట రమణ చేతులు మీ దుగా అంతర్జాతీయ పురస్కారాన్ని కృష్ణారెడ్డి అందుకున్నారు. ఆ యన్ని పలువురు అభి నందించారు.
Updated Date - 2022-08-19T04:40:02+05:30 IST