ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ వాడితే వాతే!

ABN, First Publish Date - 2022-04-10T06:42:02+05:30

పరిశ్రమలకు పవర్‌ కట్‌ విషయంలో విద్యుత్‌ శాఖాధికారులు రోజుకో రకంగా వ్యవహరిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు అధికారుల తాజా ఆదేశాలు

చీమకుర్తి, ఏప్రిల్‌ 9: పరిశ్రమలకు పవర్‌ కట్‌ విషయంలో విద్యుత్‌ శాఖాధికారులు రోజుకో రకంగా వ్యవహరిస్తున్నారు. వారంలో రెండురోజులు పవర్‌ హాలిడే, ప్రతిరోజూ సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని జారీచేసిన ఆదేశాలను విద్యుత్‌ శాఖాధికారులు అమలు చేయటంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. మర్రిచెట్లపాలెం సబ్‌స్టేషన్‌ పరిధిలో పరిశ్రమలకు, గృహ అవసరాలకు వేర్వేరుగా సరఫరా ఏర్పాట్లు లేకపోవటంతో ఒక్క రోజులేనే యూటర్న్‌ తీసుకున్నారు. తాజాగా గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. రోజూ యథావిధిగా సరఫరా చేసినా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రక్రియ చేపట్టకూడదని, ఒకవేళ  ఉత్తర్వులను ఉల్లంఘిస్తే భారీ పెనాల్టీలు విధిస్తామని గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులను హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మర్రిచెట్లపాలెం పరిధిలోని పరిశ్రమలకు శుక్రవారం సాయంత్రం పవర్‌ ఆఫ్‌ చేశారు. దీనిపై ఏడీఈ గుర్నాథంను వివరణ కోరగా మౌఖిక ఆదేశాలు జారీచేయడం వాస్తవమేనన్నారు. 

Updated Date - 2022-04-10T06:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising