ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ప్రజలకు నరకం

ABN, First Publish Date - 2022-09-25T03:54:55+05:30

వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని టీడీపీ సీనియర్‌ నాయకుడు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), మున్సిపల్‌ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు.

కొవ్వుత్తులతో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి, సెప్టెంబరు 24: వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని  టీడీపీ సీనియర్‌ నాయకుడు వీవీఆర్‌ మనోహరరావు (చిరంజీవి), మున్సిపల్‌  టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి అన్నారు. పట్టణంలోని 1వ, 20వ వార్డుల్లో టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర ఆదేశాలతో పెరిగిన ధరలకు నిరసనగా టీడీపీ  నాయకులు కొవ్వుత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ వైసీపీ వచ్చిన ఈ మూడేళ్లలో అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. విద్యుత్‌ చార్జీలను అమాంతంగా పెంచేసి పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారాలు మోపిన జగన్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం నిత్యాసర సరుకులు పేదలకు అందనంత దూరంగా ఉన్నాయన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, బస్సు చార్జీలు సైతం పెంచి సామాన్యులను కష్టాలుపాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. పథకాల పేరుతో ప్రజలను వంచించిన జగన్‌రెడ్డి ధరలు పెంచి బాదుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ  నాయకులు ఫారూక్‌, ఫిరోజ్‌, చినరామిరెడ్డి, తెలుగు మహిళలు కరణం అరుణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T03:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising