ఘనంగా దామచర్ల పుట్టినరోజు వేడుకలు
ABN, First Publish Date - 2022-01-21T04:28:12+05:30
ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుకలను టీడీపీనాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు.
ఎర్రగొండపాలెం, జనవరి 20 : ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుకలను టీడీపీనాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. పుట్టిన రోజు కేకును జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మన్నె రవీంద్ర కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒంగోలులో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రస్తుతం వైసీపీ వచ్చాక అభివృద్ధి పనులు ఒక్కటి కూడా చేసిన దాఖలాలు లేవన్నారు. టీడీపీ అధికారంలో వస్తేనే రాష్ట్రం, జిల్లాలు అభివృద్ధి బాట పడతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చేకూరి ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు షేక్ జిలానీ, కామేపల్లి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ మంత్రునాయక్, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, నాయకులు గోళ్ల సుబ్బారావు, కొత్తమాసు సుబ్రమణ్యం, తోట మహేష్, మైనార్టీసెల్ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, పట్టణాధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, 3 వార్డు మెంంబర్ కిశోర్, కందుల నారాయణరెడ్డి, మాకం జీవయ్య, బోడా చెన్నయ్య, మల్లయ్య, నక్కా రాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో వేడుకలు
పెద్ద దోర్నాల : స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా నాయకులు బట్టు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్చేసి దామచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, రావిక్రింది సుబ్బరత్నం, చంటి, దేసు నాగేంద్రబబాబు, షేక్ సమ్మద్ బాషా, కే దానం, కే శ్రీనివాస్ యాదవ్, దొడ్డా ప్రదీప్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-21T04:28:12+05:30 IST