మురుగు కాలువలో చెత్తతొలగింపు
ABN, First Publish Date - 2022-10-12T06:37:41+05:30
ఎర్రగొండపాలెం మేజరు పంచాయితిలో మంగళవారం మార్కాపురం డీఎల్పీవో జి.నాగేశ్వరరావు పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘రోజుల తరబడి రోడ్లపై నిలుస్తున్న వర్షపునీరు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది.
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
ఎర్రగొండపాలెం, అక్టోబరు 11 : ఎర్రగొండపాలెం మేజరు పంచాయితిలో మంగళవారం మార్కాపురం డీఎల్పీవో జి.నాగేశ్వరరావు పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘రోజుల తరబడి రోడ్లపై నిలుస్తున్న వర్షపునీరు’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో డీఎల్పీవో నాగేశ్వర రావు చెత్తచెదారంతో నిండి ఉన్న ఆర్టీసీబస్టాండు వద్ద సైడు కాల్వలను శుభ్రం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి పక్కన వర్షపునీరు నిలిచి బురదమయంగా ఉన్న పరిసరాల్లో బ్లీచింగ్ చల్లించారు. జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న సైడుకాల్వల్లో ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఈవోపీఆర్డీ రామసుబ్బారెడ్డిని డీఎల్పీవో ఆదేశించారు. రోడ్లపై నీళ్లు లేకుండాచర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. బోయలపల్లిలో చెత్తసంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Updated Date - 2022-10-12T06:37:41+05:30 IST