ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా దామచర్ల జన్మదినం

ABN, First Publish Date - 2022-01-21T06:00:18+05:30

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌ జన్మదిన వేడుకలను దర్శిలో గురువారం ఘనంగా నిర్వహించారు.

దర్శిలో కేకు కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి, జనవరి 20 : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌ జన్మదిన వేడుకలను దర్శిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు పుట్టినరోజు కేకు కట్‌ చేసి అభిమానులకు, నాయకులకు పంచారు.  కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ చైర్మెన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు యాదగిరి వాసు, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఎం.శోభారాణి, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సంగా తిరుపతిరావు, టీడీపీ నాయకులు పారా గాలెయ్య, గొర్రె సుబ్బారెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, షేక్‌ ఫరీద్‌, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

కనిగిరి : టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు కనిగిరిలో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి దామచర్ల పుట్టినరోజు కేక్‌ను కట్‌చేసి శ్రేణులకు పంచిపెట్టారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాయం తిరుపతిరెడ్డి, చిరంజీవి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, ఫిరోజ్‌, జంషీర్‌ అహ్మద్‌, చిన్నరామిరెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు. 

 పామూరు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలను గురువారం స్థానిక శేషమహల్‌ థియేటర్‌ ప్రాంగణంలో మండలపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలపార్టీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు కేక్‌ను కట్‌చేసి మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి చౌదరికి తినిపించారు. అనంతరం పార్టీ శ్రేణులకు కేక్‌ను పంచిపెట్టారు.  కార్యక్రమంలో పార్లమెంటు రైతు అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు తడికమళ్ళ సుబ్బారావు, ఉప్పలపాటి హరిబాబు, కోటిరెడ్డి, హుస్సేన్‌రావు, డోలా శేషాద్రి, సుభాషిణి, మాల్యాద్రి, సాంబయ్య, పువ్వాడి రామారావు, మోసే తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-21T06:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising