ఉద్యానవనం అభివృద్ధికి సహకరిస్తా
ABN, First Publish Date - 2022-05-21T06:32:42+05:30
స్థానిక తర్లుబాడు రోడ్డులోని మాగుంట సుబ్బరామి రెడ్డి ఉద్యానవనం అభివృద్ధికి సహకరిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
మార్కాపురం వన్టౌన్ మే 20 : స్థానిక తర్లుబాడు రోడ్డులోని మాగుంట సుబ్బరామి రెడ్డి ఉద్యానవనం అభివృద్ధికి సహకరిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తర్లుబా డు రోడ్డులో ఏర్పాటు చేసిన మాగుంట సుబ్బ రామిరెడ్డి పార్కను మంత్రి సురేష్, ఎమ్మెల్యే కేపీ.నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. కోటి రూపాయల వ్యయంతో పార్క్ను ఆధు నీకరించి ప్రారంభించారు. అనంతరం నూత నంగా ఏర్పాటు చేసిన సుబ్బరామిరెడ్డి విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులు అర్పిచారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివం గతులయ్యో ముందు రోజు సుబ్బరామిరెడ్డి మార్కాపురం పట్ట ణంలో ఒక శుభకార్యానికి హజరయ్యారన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరుమీద అప్పటి ఎమ్మెల్యే కేపి కొండారెడ్డి, మన్సిపల్ చైర్మన్ చిల్లంచర్ల చెంచయ్యలు పార్క్ను ఏర్పాటు చేశామన్నారు. మంత్రి సురేష్తో కలిసి వారి సహయంతో నిధులు సమకూర్చి మరింత అభివృద్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిల్లంచర్ల బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ, ఎంపీపీ పోరెడ్డి అరుణ, కమిషనర్ నయిమ్ అహ్మద్, డీఈ షేక్ సభాని తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-05-21T06:32:42+05:30 IST