టీడీపీ కార్యకర్తల మృతికి సంతాపం
ABN, First Publish Date - 2022-12-31T22:23:05+05:30
కందుకూరు పట్టణంలో తొక్కిస లాటలో టీడీపీ కార్యకర్తల మృ తికి టీడీపీ కా ర్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మన బోయిన వెంగయ్య ఆధ్వ ర్యంలో శనివారం సంతాప కా ర్యక్రమం నిర్వహించారు.
సీఎస్పురం, డిసెంబర్ 31 : కందుకూరు పట్టణంలో తొక్కిస లాటలో టీడీపీ కార్యకర్తల మృ తికి టీడీపీ కా ర్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మన బోయిన వెంగయ్య ఆధ్వ ర్యంలో శనివారం సంతాప కా ర్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎస్పురం వైస్ సర్పంచ్ పాములపాటి నర్సయ్య, పార్టీ నాయ కులు ఎన్జీ మాల కొండయ్య, పునుగుపాటి రవికుమార్, అట్లూరి రాయకృష్ణంరాజు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి దేవెండ్ల తిరుపతయ్య, ఒంగోలు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ రజ్జబ్ బాషా, పి.గురుకృష్ణ, షేక్ హాజీమలాన్, బి.శ్రీను, కోనంగి వెంకటకొండయ్య, కోటగిరి శ్రీను, చావా చంద్ర శేఖర్, ఎన్.ఎరికలయ్య, కె.వెంకటస్వామి, బండారు పెదవెంకటేశ్వర్లు, రాయని వెంకటేశ్వర్లు, బి.వెంకటయ్య, శ్యామల తిరుపతిరెడ్డి, ఎర్రగొండయ్య పాల్గొన్నారు.
లోకేష్ యాత్రను జయప్రదం చేయాలి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంగయ్య శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన విలేకరుల సమా వేశంలో లోకేష్ పాదయాత్రపై మాట్లాడారు. ఆయనతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఘటన దురదృష్టకరం
పామూరు : కందుకూరులో టీడీపీ కార్యకర్తల మృతి బాధాకరమని టీడీపీ మండల నాయకులు సంతాపం తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కందుకూరులో ప్రమాదశాత్తు జరిగిన ఘటనను వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి వారికి ప్రజ లంతా ఏకమై రా నున్న ఎన్నికల్లో తరిమికొట్టాలన్నారు. సమావేశంలో చినచెంచయ్య, ప్రభాకర్, ఖాజా ర హంతుల్లా, అమీర్ బాబు, వెంకటేశ్వర్లు, గౌస్బాషా, రఫి, ఇర్రికోటిరెడ్డి, శేషు, రామారావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T22:23:07+05:30 IST