ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, లోకేష్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

ABN, First Publish Date - 2022-01-22T05:19:23+05:30

కరోనా భారినపడి చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకే్‌షలు త్వరగా కోలుకోవాలని పట్టణంలోని పెద్దమసీదులో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారు కరోనా నుంచి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాపోరాట దిశగా అడుగులు వేయాలని ప్రార్థించారు.

గిద్దలూరు పెద్ద మసీదులో ప్రార్థనలు చేస్తున్న టీడీపీ శ్రేణులు, ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, జనవరి 21 : కరోనా భారినపడి చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు,  ఆయన కుమారుడు నారా లోకే్‌షలు త్వరగా కోలుకోవాలని పట్టణంలోని పెద్దమసీదులో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారు కరోనా నుంచి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాపోరాట దిశగా అడుగులు వేయాలని ప్రార్థించారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, మాజీ అధ్యక్షుడు మస్తాన్‌, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి షేక్‌ మహబూబ్‌బాషా, నాయకులు ఆదామ్‌, తదితరులు పాల్గొన్నారు.

పుల్లలచెరువులో పూజలు

పుల్లలచెరువు : చంద్రబాబునాయుడు, లోకే్‌షలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని  మండల టీడీపీ ఆధ్వర్యంలో చౌటపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో నాయకులు శుక్రవారం పూజలు చేశారు.ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో  టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్‌,  నాయకులు కాకర్ల కోటయ్య, టౌన్‌ అధ్యక్షుడు కుడుముల లాలయ్య,  నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T05:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising