ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై స్పందించకపోతే చర్యలు తప్పవు: ఆర్డీవో

ABN, First Publish Date - 2022-04-24T07:55:48+05:30

ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని లేకపోతే చర్యలు తప్పవని కనిగిరి ఆర్డీవో కిడారి సందీప్‌ కుమార్‌ హెచ్చరించారు.

లేఅవుట్‌ పరిశీలిస్తున్న ఆర్‌డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురిచేడు, ఏప్రిల్‌ 23: ప్రజా సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని లేకపోతే చర్యలు తప్పవని కనిగిరి ఆర్డీవో కిడారి సందీప్‌ కుమార్‌ హెచ్చరించారు. కురిచేడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందీప్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజలు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం గృహనిర్మాణ శాఖకు చెందిన లేఅవుట్‌ను పరిశీలించారు. ఎంతమంది గృహాలు నిర్మించారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రివ్యూ నిర్వహించారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అలస్యం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నాగుల్‌ మీరా, వైద్యాధికారి ప్రవీణ్‌, విద్యుత్‌ శాఖ ఏఈ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T07:55:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising