ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-08-13T06:37:43+05:30

రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలను పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పర్చూరు నియో జకవర్గ తెలుగు మహిళా కార్యదర్శి పూరిమెట్ల జయమ్మ అన్నారు.

బాదుడే బాదుడులో టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు మహిళ నియోజకవర్గ కార్యదర్శి జయమ్మ

చిననందిపాడు(పర్చూరు), ఆగస్టు 12: రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలను పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పర్చూరు నియో జకవర్గ తెలుగు మహిళా కార్యదర్శి పూరిమెట్ల జయమ్మ అన్నారు. శుక్రవారం మండలంలోని చిననందిపాడు గ్రామంలో టీడీపీ అఽధ్వర్యంలో బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెట్టి రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలను పెంచి ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తొలుత గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌.షంషుద్దీన్‌, కార్యదర్శి కొరిటాల సురేష్‌, గ్రామ సర్పంచ్‌ మువ్వా వెంకటశివరావు, కొత్త జయమ్మ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి మామిడిపాక హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇంకొల్లు :వైసీపీ ప్రభుత్వ పాలనలో నిత్యవసరాలు,పెట్రోలు ధరలు విపరీతంగా పెరిగి ప్రజలపై అధనపు భారం మోపుతోందని టీడీపీ మండల అధ్యక్షుడు  నాయుడు హనుమంతరావు అన్నారు.మండలంలోని నాగండ్లలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో భాదుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు బేతపూడి సురేష్‌బాబు,వీరగంధం ఆంజనేయులు,గుంజి వెంకట్రావు  నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-13T06:37:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising