Pawanను కలిసిన ప్రకాశం జిల్లా రైతు ప్రతినిధులు
ABN, First Publish Date - 2022-06-05T00:51:11+05:30
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ప్రకాశం జిల్లా రైతు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అన్నంపెట్టే రైతన్న
అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్ను ప్రకాశం జిల్లా రైతు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అన్నంపెట్టే రైతన్న బహిరంగంగా మోసపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ముఠాగా ఏర్పడి రైతుకష్టం దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మిల్లర్లు కనీస ధర ఇవ్వకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘గడపగడప’ కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించమని అడిగితే బెదిరిస్తున్నారని విమర్శించారు. గడపగడపకు వెళ్తే జేజేలు కొడతారని ఎలా అనుకున్నారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Updated Date - 2022-06-05T00:51:11+05:30 IST