చీరాల రైల్వేస్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
ABN, First Publish Date - 2022-04-25T15:21:53+05:30
సీఎం కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
బాపట్ల: సీఎం కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చీరాల రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లో ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్ళే యూటీఎఫ్ నాయకులు, టీచర్లను గుర్తించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చీరాల, వేటపాలెం పరిధిలో 30 మంది టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2022-04-25T15:21:53+05:30 IST