ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అరెస్ట్పై గోప్యత పాటిస్తున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-05-23T17:56:42+05:30

వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ అరెస్ట్పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ అరెస్ట్పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. ఇంకా ఎమ్మెల్సీ అరెస్ట్పై పోలీసులు ఎటుంవటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ను జడ్జి ఎదుట హాజరుపరిచి.. రాజమండ్రి జైలుకు తరలించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఎస్పీ పోలీస్ గెస్ట్హౌస్లో ఉంచారని మరో వదంతి సైతం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించాలని మరో వాదన వినిపిస్తోంది. ముందు కాకినాడ జైలుకు తీసుకువచ్చి ఎంట్రీ చేయించాకే.. రాజమండ్రి జైలుకు తరలించాల్సి ఉంటుందని లాయర్లు చెబుతున్నారు.  


కాగా.. ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారణ అయింది. రోడ్డు ప్రమాదమంటూ ఎమ్మెల్సీ చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోయింది. పోస్టుమార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతుమీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. 

Updated Date - 2022-05-23T17:56:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising