ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: జగన్ రాజీనామా చేస్తారా?: రఘురామ

ABN, First Publish Date - 2022-08-19T01:02:30+05:30

గత ప్రభుత్వ హయాంలో పోలవరం (Polavaram) పనులు 72% పూర్తయితే.. జగన్‌ పాలనలో 3 శాతం పనులు కూడా పూర్తికాలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: గత ప్రభుత్వ హయాంలో పోలవరం (Polavaram) పనులు 72% పూర్తయితే.. జగన్‌ పాలనలో 3 శాతం పనులు కూడా పూర్తికాలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి రూ.20 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. అసమర్థ ప్రభుత్వం తీరుతో ఏపీకి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష కోట్ల రాష్ట్ర నిధులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం (Kaleshwaram) పూర్తి చేసుకుందని, మనం పోలవరం పూర్తి చేయలేకపోయామని విమర్శించారు. జనాలను మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నారని, హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలని గతంలో జగనే అన్నారని విమర్శించారు. జగన్ రాజీనామా చేస్తారా? ఢిల్లీకి వచ్చి పోరాడుతారా? అని ప్రశ్నించారు. జగన్‌ (Jagan) ఇప్పటికైనా ప్రధానిని కలిసి పోలవరం పూర్తిచేయాలని అడగాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తికాకపోతే.. గోదావరి జలాల్లో ఇబ్బందులు తప్పవని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

Updated Date - 2022-08-19T01:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising