పింగళి కుమార్తె కన్నుమూత
ABN, First Publish Date - 2022-07-22T08:13:12+05:30
పింగళి కుమార్తె కన్నుమూత
మాచర్ల, జూలై 21: జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె.. శతాధిక వృద్ధురాలయిన ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని స్వగృహంలో గురువారం ఆమె తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్న సమయంలో అస్వస్థతగా అనిపించడంతో తనతో పాటు ఇంట్లోనే ఉన్న కుమారుడు నరసింహానికి తాను చనిపోతున్నానంటూ చెప్పారు. అయితే నీకేం కాదంటూ నరసింహం ఆమెకు ధైర్యం చెప్పారు. రాత్రి 8గంటల సమయంలో ఆమెలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో కుమారుడు వైద్యునికి ఫోన్ చేయగా ఆయన పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు.
సీతామహాలక్ష్మికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. జాతీయ జెండా రూపొందించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గతేడాది మార్చి 12న సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో ముచ్చటించారు. అలాగే ఈ ఏడాది మే 10న తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ మాచర్ల చేరుకొని సీతామహాలక్ష్మిని కలిశారు.
Updated Date - 2022-07-22T08:13:12+05:30 IST