పందుల.. పందేలు
ABN, First Publish Date - 2022-05-19T08:43:50+05:30
పందుల.. పందేలు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురంలో బుధవారం పందుల పోటీలు రసవత్తరంగా సాగాయి. ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరానికి చెందిన రెండు పందులు పోటీల్లో తలపడగా.. ద్వారకా తిరుమల వరాహం విజేతగా నిలిచింది. ఈ పోటీలను ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అయితే ఈ పోటీలు నిర్వహించిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ద్వారకా తిరుమల
Updated Date - 2022-05-19T08:43:50+05:30 IST