Piduguralla ఎంపీపీ రమణమ్మ నిరసన
ABN, First Publish Date - 2022-06-24T19:18:46+05:30
జిల్లాలో పిడుగురాళ్ల ఎంపీపీ రమణమ్మ నిరసనకు దిగారు. ఎంపీపీగా ఉన్న తనకు ఎంపీడీఓ ఆఫీస్లో కుర్చీ కూడా లేదని ఆవేదన చెందారు.
పల్నాడు: జిల్లాలో పిడుగురాళ్ల ఎంపీపీ(MPP) రమణమ్మ నిరసనకు దిగారు. ఎంపీపీగా ఉన్న తనకు ఎంపీడీఓ ఆఫీస్లో కుర్చీ కూడా లేదని ఆవేదన చెందారు. వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డి(Venkateshwar reddy) ఎంపీపీ సీటులో కూర్చుని అంతా తానై వ్యవహారిస్తున్నారంటూ మండల సర్వసభ్య సమావేశం రోజున రమణమ్మ నిరసనకు దిగారు. సమావేశంలోకి రాకుండా చెట్టు క్రింద కూర్చొని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది తీరుపై అసహానం వ్యక్తంచేశారు. అయితే రమణమ్మకు తోటి ఎంపీటీసీలు సర్దిచెప్పడంతో నిరసనను విరమించుకున్నారు.
Updated Date - 2022-06-24T19:18:46+05:30 IST