ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ పాఠశాలలకు పీజీటీ, టీజీటీలు

ABN, First Publish Date - 2022-08-06T08:55:39+05:30

ఆదర్శ పాఠశాలలకు పీజీటీ, టీజీటీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

282 మందిని కాంట్రాక్టుపై తీసుకునేందుకు నోటిఫికేషన్‌

8 నుంచి దరఖాస్తుల స్వీకరణ

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)లను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 282 మందిని కాంట్రాక్టుపై తీసుకోనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 211 పీజీటీ, 71 టీజీటీ పోస్టులు ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 17 వరకు దరఖాస్తులకు గడువుందని పేర్కొంది. 18 నుంచి 44ఏళ్ల మధ్య ఉన్నవారు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌.. ఠీఠీఠీ.ఛిట్ఛ.్చఞ.జౌఠి.జీుఽ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 49ఏళ్ల వరకు అవకాశం ఉందని తెలిపింది. ఈ భర్తీలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుందని, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మినిమం టైమ్‌ స్కేలు ప్రకారం వీరికి వేతనాలు ఇస్తారని వివరించింది. 


Updated Date - 2022-08-06T08:55:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising