ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికేంద్రీకరణకు వక్రభాష్యం: సీపీఎం శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-03-19T22:50:51+05:30

వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యాలు చెబుతోందని సీపీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యాలు చెబుతోందని సీపీఎం నాయకులు శ్రీనివాసరావు అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో అమరావతి ప్రజాబాట ఐదవ రోజు కార్యక్రమాన్ని తుళ్లూరులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణ అంటే రాజధాని ముక్కలు చేయడం కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ, హైకోర్టు తీర్పు ప్రకారం అభివృద్ధి చేపడతామని ముఖ్యమంత్రి శాసనసభలో విస్పష్ట ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష కోట్ల రూపాయలు అవసరమైన అమరావతికి లక్ష రూపాయలను కేంద్ర బడ్జెట్లో కేటాయించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోడీ, బీజేపీ ప్రభుత్వం అవమాన పరిచిందని ఆయన ఆరోపించారు. అమరావతి అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఉమ్మడి పోరు సాగిస్తామని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2022-03-19T22:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising