ఏలూరు మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి: పవన్
ABN, First Publish Date - 2022-04-14T21:01:31+05:30
ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఘటన విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ఏలూరు పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఘటన విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఏమిటి? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. లూరు ఘటనలో మృతుల కటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ తెలిపారు. మృతుల కుటుంబాలకు కంపెనీ తరపున రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రతాప్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని ప్రతాప్ పేర్కొన్నారు.
Updated Date - 2022-04-14T21:01:31+05:30 IST