పవన్ క్లారిటీ లేని నాయకుడు: బాలినేని
ABN, First Publish Date - 2022-04-07T00:44:39+05:30
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ లేని నాయకుడని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
ఒంగోలు: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ లేని నాయకుడని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఒంగోలు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు చేసేందుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సీఎం జగన్మోహన్రెడ్డి ఇష్టమని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచామని, గతంలో రూ.68వేల కోట్లు చంద్రబాబు అప్పులు చేసి వెళ్లడం వల్లే భారం పడిందని తెలిపారు. తెలంగాణలో రూ.5వేలు కోట్లు ప్రజలపై భారం వేశారని, ఏపీలో రూ.1800 కోట్లు మాత్రమేభారం పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించేందుకు ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Updated Date - 2022-04-07T00:44:39+05:30 IST