Jagan ప్రోగ్రాంకు పాసులు కూడా సిద్ధమయ్యాక Mediaకు ఊహించని షాక్
ABN, First Publish Date - 2022-07-07T16:05:51+05:30
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(AP CM Jaganmohan Reddy) రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Kadapa : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(AP CM Jaganmohan Reddy) రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అంతా బాగానే ఉంది కానీ మీడియాకు సడెన్గా పాసుల(Passes)ను రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదేదో జగన్ పర్సనల్ ప్రోగ్రాం అయితే చర్చించుకోవాల్సిన పని లేదు కానీ అధికారిక కార్యక్రమాలకు మీడియాను అనుమతించకపోవడం ఆసక్తికరంగా మారింది. నేడు, రేపు పులివెందుల నియోజకవర్గంలో జగన్ పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి పాసులు కూడా సిద్ధమయ్యాక ఉన్నఫలంగా మీడియాకు ప్రభుత్వం అనుమతిని రద్దు చేసింది. పులివెందుల, వేంపల్లెలో అధికారిక కార్యక్రమాలు ఉన్నా కూడా మీడియాకు అనుమతి లేక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2022-07-07T16:05:51+05:30 IST