ఆలయాల్లో ‘ఆర్గానిక్’ ప్రసాదం
ABN, First Publish Date - 2022-08-11T09:11:12+05:30
ఆలయాల్లో ‘ఆర్గానిక్’ ప్రసాదం
దేవదాయ శాఖ ప్రతిపాదన
అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): టీటీడీలో మాదిరిగా దేవాలయాల్లో ఆర్గానిక్ ఆహార పదార్థాలతో తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులకు అందించాలని దేవదాయ శాఖ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ బుధవారం తన కార్యాలయంలో రాష్ట్రంలోని ఆర్జేసీలతో సమావేశం నిర్వహించారు. దీని వల్ల రైతులకు కూడా మేలు జరుగుతోందని మార్క్ఫెడ్ అధికారులు వివరించారు. తొలుత 8 మేజర్ టెంపుల్స్లో దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు.
Updated Date - 2022-08-11T09:11:12+05:30 IST