Andhra news: తిరుపతిలో మరోసారి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు
ABN, First Publish Date - 2022-07-20T14:57:31+05:30
నగరంలో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యంపాలైంది.
తిరుపతి: నగరంలో ప్రజాస్వామ్యం(democracy) మరోసారి అపహాస్యంపాలైంది. తిరుపతి కో అపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ(Sugunamma), తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్(Narasimha yadav), సంజయ్(Sanjay), రవి నాయుడు(Ravi naidu), ఆర్సీ మునికృష్ణ(RC munikrishna), ఇతర టీడీపీ(TDP) కీలక నేతలు హౌస్ అరెస్ట్ చేశారు. అభ్యర్థులను కూడా పోలీసులు పోలింగ్ బూత్ నుంచి తరిమేశారు. ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు పడుతున్నాయి. ప్రశ్నించిన వారినందరిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Updated Date - 2022-07-20T14:57:31+05:30 IST