కర్నూలు జిల్లాలో నవవధువు ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-04-05T13:24:05+05:30
కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మం. కె.తిమ్మాపురంలో విషాదం చోటుచేసుకుంది.
కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మం. కె.తిమ్మాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని నవవధువు రేణుక(19) ఆత్మహత్య చేసుకుంది. రెండు నెలల క్రితమే వీరేష్తో రేణుకకు వివాహం జరిగింది. ఉగాది పండుగకు పుట్టింటికి వెళ్లి అత్తారింటికి వచ్చిన కొద్ది సేపటికే రేణుక ఆత్మహత్యకు పాల్పడింది. రేణుక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రేణుక ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Updated Date - 2022-04-05T13:24:05+05:30 IST