ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేనులు
ABN, First Publish Date - 2022-01-22T22:50:25+05:30
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం కేసులు
అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. సంక్రాంతి పండుగ అనంతరం కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 12,926 కరోనా కేనులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 21,66,194 నమోదయ్యాయి. కరోనా కారణంగా మొత్తం మరణాలు 14,538 సంభివించాయి. ప్రస్తుతం 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Updated Date - 2022-01-22T22:50:25+05:30 IST