యూరియా బస్తాలో కాదు.. ఇప్పుడు బాటిళ్లలో!
ABN, First Publish Date - 2022-01-15T04:27:33+05:30
ఇఫ్కో ద్వారా యూరియా బస్తాల రూపంలో కాకుండా ద్రావణంగా బాటిళ్లలో లభిస్తుందని రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ రఽశీధర్రెడ్డి అన్నారు.
ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్రెడ్డి
మనుబోలు, జనవరి 14: ఇఫ్కో ద్వారా యూరియా బస్తాల రూపంలో కాకుండా ద్రావణంగా బాటిళ్లలో లభిస్తుందని రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ రఽశీధర్రెడ్డి అన్నారు. స్థానిక మ్యాక్స్ సొసైటీలో శుక్రవారం ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాటు ప్రయోగాల అనంతరం యూరియాను బాటిళ్లలో నానో యూరియా లిక్విడ్గా అందిస్తున్నామన్నారు. అరలీటరు ద్రావణం ఎకరాకు పిచికారీ చేస్తే 45 కిలోల బస్తా యూరియా కంటే మెరుగ్గా పనిచేస్తుందన్నారు. బస్తా యూరియా ధర కంటే నానోయూరియా లిక్విడ్ తక్కువ ధరకే లభిస్తుందన్నారు. ఇది మొక్కకు నూరుశాతం ఉపయోగపడుతుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇఫ్కో ఆర్జీబీ సభ్యుడు తలమంచి సురేష్కుమార్రెడ్డి, మార్కెటింగ్ అధికారి అతావుల్లా, ఇఫ్కో సెజ్ ప్రతినిధులు బొమ్మిరెడ్డి చైతన్య, సోమేశ్వరరావు, మ్యాక్స్ సొసైటీ డైరెక్టర్ తుమాటి శ్రీనివాసులురెడ్డి, మనుబోలు పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి బొమ్మిరెడ్డి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-01-15T04:27:33+05:30 IST